Hari Hara Veera Mallu: పవర్స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ఐదేళ్ల ముందు ప్రారంభమైన ఈ చిత్రం కరోనా, పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వంటి పలు కారణాలతో షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు పవన్ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించటంతో సినిమాను పూర్తి చేశారు. ఈ క్రమంలో ‘హరిహర వీరమల్లు’ రిలీజ్కు సంబంధించి చాలా డేట్స్ వచ్చాయి. అయితే ఔట్పుట్ విషయంలో మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకపోవటంతో సినిమా రిలీజ్ డేట్స్ మారుతూ వచ్చాయి. రీసెంట్గానూ జూన్12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే గ్రాఫిక్స్ వర్క్లో జరిగిన డిలే కారణంగా సినిమా మరోసారి వాయిదా పడింది.
వాయిదా పడిన ‘హరిహర వీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందా? అనే దానిపై ఇండస్ట్రీ వర్గాల్లో చాలా చర్చే జరుగుతూ వస్తోంది. తాజాగా మేకర్స్ జూలై 24న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించటం ఫ్యాన్స్కు ఎంతో సంతోషాన్నిచ్చిందనే చెప్పాలి. అయితే ఈ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేసే క్రమంలో చాలా డిస్కషన్స్ జరిగాయి. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే జూలై 25న విజయ్ దేవర కొండ హీరోగా నటిస్తోన్న కింగ్డమ్ మూవీ రానుంది. ఈ రెండు సినిమాలు పక్క పక్కనే రావటం డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్కు కాస్త ఇబ్బందికరమే అయినా, ఇక తప్పలేలాగా కనిపించలేదు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/dhanush-nagarjuna-kubera-review/
హరిహరవీరమల్లు చిత్రంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుని ఎదరించే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు. నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ హీరోయిన్స్గా నటించారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ఆయనే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ను కంపోజ్ చేయటం విశేషం. ఈ ఎపిసోడ్ పదినిమిషాలకు పైగానే ఉంటుందనేది సినీ వర్గాల టాక్. సినిమా బడ్జెట్ విషయానికి మూవీ ఇప్పటికే మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ను వెచ్చింది నిర్మాత ఎ.ఎం.రత్నం అన్కాంప్రమైజ్డ్గా సినిమాను నిర్మించారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ఇది. రెండు భాగాలుగా సినిమాను అనకున్నారు. ఇది తొలి భాగం మాత్రమే. దీని రిలీజ్ తర్వాతే రెండో భాగానికి సంబంధించిన నిర్ణయం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి.