Thursday, September 19, 2024
Homeచిత్ర ప్రభRadhika : చిరంజీవితో ఎప్పుడూ గొడవలే.. రజినీకాంత్ చాలా బోరింగ్ మనిషి..

Radhika : చిరంజీవితో ఎప్పుడూ గొడవలే.. రజినీకాంత్ చాలా బోరింగ్ మనిషి..

- Advertisement -

Radhika : బాలయ్య బాబు హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షో సెకండ్ సీజన్ కూడా సక్సెస్ గా సాగిపోతుంది. తాజాగా నాలుగో ఎపిసోడ్ కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మరో రాజకీయనాయకుడు సురేష్ రెడ్డి వచ్చారు. అలాగే అలనాటి హీరోయిన్ రాధికా కూడా వచ్చి సందడి చేసింది.

వారిద్దరితో రాజకీయాలు, ఒకప్పటి అల్లరి విశేషాలు మాట్లాడగా రాధికతో సినిమాల గురించి, హీరోల గురించి మాట్లాడాడు బాలయ్య. ఈ ఎపిసోడ్ లో రాధిక పలు ఆసక్తికర విషయాలని షేర్ చేసుకుంది. అప్పట్లో తాను హీరోయిన్ గా పని చేసిన హీరోల గురించి మాట్లాడింది.

ఈ నేపథ్యంలో రాధిక మాట్లాడుతూ.. చిరంజీవి, నేను సరదాగా ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటాము. చిరంజీవి నన్ను ఎక్కువగా తిడతాడు, నేను ఎక్కువగా వాగుతాను అని అంటాడు. ఇద్దరం కొట్టుకుంటూనే ఉంటాము. మా ఇద్దరి మధ్య అలా సరదాగా గొడవలు జరుగుతూ ఉంటాయి అని చెప్పింది.

ఇక రజినీకాంత్ గురించి మాటాడుతూ.. రజినికాంత్ చాలా బోరింగ్ మనిషి. సెట్ లో అస్సలు మాట్లాడాడు. తన పని తాను చూసుకుంటాడు. ఒకవేళ మాట్లాడినా ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడతాడు అని తెలిపింది. అలాగే మిగతా హీరోల గురించి కూడా మాట్లాడింది రాధిక.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News