Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభRaviteja : బుల్లితెరపై మాస్ మహారాజ్ ఎంట్రీ.. ఆ షో కోసమే..

Raviteja : బుల్లితెరపై మాస్ మహారాజ్ ఎంట్రీ.. ఆ షో కోసమే..

- Advertisement -

Raviteja : ఇటీవల సినిమాల ప్రమోషన్స్ కోసమో లేదా టీవీ టీఆర్పీలని పెంచుకోవడం కోసమో సినీ సెలబ్రిటీలు కూడా బుల్లితెరపై కనువిందు చేస్తున్నారు. మన తెలుగులో డ్యాన్స్ షో ఢీ బాగా పాపులర్. ఈటీవీలో వచ్చే ఈ షో ఎప్పట్నుంచో సీజన్లుగా వస్తుంది. తాజగా ఢీ 14వ సీజన్ నడుస్తుంది. ఈ సీజన్లో ప్రదీప్ యాంకర్ గా హైపర్ ఆది, అఖిల్ సార్థక్, నాయని పావని, శ్వేతా నాయిడు మెంటార్స్ గా, పూర్ణ, అనీ మాస్టర్, జానీ మాస్టర్ జడ్జీలుగా కొనసాగుతున్నారు.

ఈ షో ఫైనల్ ఎపిసోడ్ కి, విన్నర్స్ కి ట్రోఫీ అందించడానికి ప్రతీ సారి ఎవరో ఒక స్టార్ సెలబ్రిటిని తీసుకొస్తారు. గతంలో ఢీ షో ఫైనల్ ఎపిసోడ్స్ కి రాజమౌళి, ఎన్టీఆర్, అల్లు అర్జున్ .. ఇలా పలువురు సెలబ్రిటీలు విచ్చేశారు. ఈ సారి మాస్ మహారాజ్ రవితేజ ఢీ షోలో కనువిందు చేయనున్నారు. తాజాగా ఈ షో నుంచి రవితేజకి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు.

ఈ ప్రోమోలో మాస్ మహారాజ్ ఎంట్రీ అద్భుతంగా ఉంది. గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. ఇక రవితేజ తన మార్క్ కామెడీతో అందర్నీ నవ్వించినట్లు తెలుస్తుంది. దీంతో ఈ ఎపిసోడ్ కోసం మాస్ మహారాజ్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఢీ షో 14వ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ డిసెంబర్ 4న టెలికాస్ట్ కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News