యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonalagadda) ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలతో యూత్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘తెలుసు కదా'(Telusu Kada) అనే రొమాంటిక్ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా మూవీ రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు.
ఈమేరకు ఓ ఆసక్తికర వీడియోను విడుదల చేశారు. ఈ మూవీని దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదల చేస్తున్నామంటూ అధికారికంగా ప్రకటించారు. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా చేస్తున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా ఇటీవల ‘జాక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సిద్ధుకు, ఆశించిన స్థాయిలో మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో నిరాశే ఎదురైంది. దీంతో ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్లోకి రావాలి అనుకుంటున్నాడు.