Sunday, June 15, 2025
Homeచిత్ర ప్రభFilm Industry: సీఎం చంద్రబాబుతో సినీ పెద్దల భేటీ వాయిదా

Film Industry: సీఎం చంద్రబాబుతో సినీ పెద్దల భేటీ వాయిదా

Telugu Film Industry: ఏపీ ప్రభుత్వం, టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీ మధ్య గ్యాప్ తగ్గేలా కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఇంతరవకు సినీ పెద్దలు సీఎం చంద్రబాబు(CM Chandrababu)ను కలవకపోవడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల థియేటర్స్ బంద్ వివాదం నేపథ్యంలో ఇండస్ట్రీ ప్రముఖులపై పవన్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇండస్ట్రీకి మద్దతుగా నిలవాలని చూస్తున్నా చిత్ర పరిశ్రమ నుంచి సరైన స్పందన లేదని మండిపడ్డారు. మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటూ ధ్వజమెత్తారు.

దీంతో దిగివచ్చిన పలువురు నిర్మాతలు ఇందులో తమ తప్పు ఏం లేదంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంతో మంచి సంబంధాలు కోరుకుంటున్నామని తెలిపారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు ముహుర్తం కూడా ఖరారైంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కలవాలని నిర్ణయించారు. తొలుత పవన్ కళ్యాణ్ ను కలిసి ఆ తర్వాత చంద్రబాబుతో సమావేశం కావాలని డిసైడ్ అయ్యారు. 30 నుంచి 35 మంది దాకా ఇండస్ట్రీ తరపును హాజరుకానున్నట్లు వార్తలు వచ్చాయి.

బాలకృష్ణ, వెంకటేష్, నాని, మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్, సుమన్, ఆర్.నారాయణమూర్తి, అల్లు అరవింద్, దిల్ రాజు, అశ్వనీ దత్, డీవీవీ దానయ్య, రాజమౌళి, బోయపాటి శీను, త్రివిక్రమ్ శ్రీనివాస్, వంశీ పైడిపల్లి, నాగ్ అశ్విన్ తదితరులు చంద్రబాబును కలవనున్నారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సమావేశం వాయిదా పడినట్లు సమాచారం.

సీఎం చంద్రబాబును కలిసే వారిలో కొంతమంది ప్రముఖులు షూటింగ్ ల నిమిత్తం వేరే ప్రాంతాల్లో ఉన్నారని.. అందుకే ఈ సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది. సీఎం అపాయింట్మెంట్ ఖరారైన తర్వాత పలువురు ప్రముఖులు అందుబాటులో లేకపోవడం మరింత చర్చనీయాంశంగా మారింది. పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో ఏపీ ప్రభుత్వం, తెలుగు చిత్ర పరిశ్రమ మధ్య వివాదం ముగిసేలా లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News