Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభKantara 2: ‘కాంతార-2’ ఎప్పుడొస్తుంది.. రిషబ్ శెట్టి ఏం చెప్పాడు?

Kantara 2: ‘కాంతార-2’ ఎప్పుడొస్తుంది.. రిషబ్ శెట్టి ఏం చెప్పాడు?

Kantara 2: ఈ ఏడాది సంచలనాత్మక చిత్రం ఏదైనా ఉందంటే అది ‘కాంతార’. ఎందుకంటే ఎలాంటి అంచనాలు లేకుండా, తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా అనూహ్య విజయం సాధించింది. రిషబ్ శెట్టి, సప్తమి గౌడ జంటగా నటించిన ఈ చిత్రం కన్నడతోపాటు, తెలుగు, హిందీ వంటి భాషల్లో భారీ విజయాన్ని నమోదు చేసింది.

- Advertisement -

పాతిక కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.400 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ ఏడాది మిగతా చిత్రాలు ఇంతకంటే పెద్ద విజయం సాధించినప్పటికీ, వాటి వెనుక సీక్వెల్ ట్యాగ్, స్టార్స్ కాంబినేషన్ వంటివి ఉన్నాయి. కానీ ‘కాంతార’ విజయం వెనుక ఉన్నది మాత్రం కంటెంటే. నెమ్మదిగా మొదలై ప్రభంజనాన్ని సృష్టించింది ఈ చిత్రం. ఈ సినిమా చూసినప్పుడే దీనికి సీక్వెల్ రాబోతుందని అర్థమైంది. క్లైమాక్స్‌లో సీక్వెల్ ఉండబోతుందని హింట్ ఇచ్చారు. ఈ సీక్వెల్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ, దీని గురించి ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.

ఈ అంశంపై తాజాగా చిత్ర కథానాయకుడు, దర్శకుడు రిషబ్ శెట్టి స్పందించాడు. మంగళూరులో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన రిషబ్ ‘కాంతార-2’ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ‘కాంతార-2 గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు. దీనికంటే ముందే వేరొక చిత్రం చేస్తున్నాను. ఆ తర్వాతే కాంతార-2 మొదలుపెడతాను. కాంతార చిత్రం గురించి అడిగేందుకు, దైవ నర్తక అనుమతి తీసుకునేందుకు ఇక్కడికి వచ్చాను. కాంతార-2 తీసేందుకు భగవంతుడి అనుమతి లభించింది’’ అని రిషబ్ తెలిపారు. త్వరలోనే కాంతార-2 చిత్రంపై వర్క్ చేస్తానని, దానికంటే ముందు మరో సినిమా చేస్తానని ఆయన చెప్పారు. దీంతో వచ్చే ఏడాది కాంతార-2 విడుదలయ్యే అవకాశం లేనట్లే అని చెప్పాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News