Sunday, November 16, 2025
Homeనేరాలు-ఘోరాలుWanaparthy : పంటపొలాల్లోకి దూసుకెళ్లిన పెళ్లిబృందం జీపు

Wanaparthy : పంటపొలాల్లోకి దూసుకెళ్లిన పెళ్లిబృందం జీపు

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న జీపు బోల్తా పడటంతో.. 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. కానాయపల్లికి చెందిన 14 మంది క్రూయిజర్ జీపులో హైదరాబాద్ లో జరిగే పెళ్లికి వెళ్తున్నారు. పాలెం బ్రిడ్జి వద్దకు రాగానే క్రూయిజర్ అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారందరూ తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. స్థానికుల సహాయంతో గాయపడిన వారందరినీ అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad