Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుGang Rape: మహిళపై ఐదుగురు సామూహిక అత్యాచారం, ఇంట్లో చోరీ.. ముగ్గురు అరెస్ట్

Gang Rape: మహిళపై ఐదుగురు సామూహిక అత్యాచారం, ఇంట్లో చోరీ.. ముగ్గురు అరెస్ట్

Bengaluru Gang Rape Robbery: దేశ ఆర్థిక రాజధాని బెంగళూరు నగర శివార్లలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు రూరల్ జిల్లాలోని గంగొండనహళ్లి ప్రాంతంలో ఒక మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, వారి ఇంట్లో దోపిడీకి కూడా పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి 9:15 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య ఈ అమానుష ఘటన జరిగింది.

- Advertisement -

ALSO READ: Samosa Argument Murder: సమోసా విషయంలో పిల్లల మధ్య గొడవ.. జోక్యం చేసుకున్న వృద్ధుడిని హతమార్చిన మహిళ

బాధితురాలి ఇంట్లో మొత్తం ఆరుగురు నివాసం ఉంటున్నారు. ఐదుగురు నిందితులు తలుపు తెరవాలని కోరి, బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డారు.

రెండు మొబైల్ ఫోన్లు, 25 వేల నగదు చోరీ

అర్ధరాత్రి 12.30 గంటలకు బాధితురాలి పెద్ద కుమారుడు పోలీసులకు అత్యవసర కాల్ చేయడంతో, సీనియర్ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

“నిందితులు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, ఇంట్లో నుంచి రెండు మొబైల్ ఫోన్లు మరియు రూ. 25,000 నగదును కూడా దొంగిలించారు” అని బెంగళూరు రూరల్ ఎస్పీ సి.కె. బాబా తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాధితురాలు మరో ఇద్దరు మహిళలు, ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలతో కలిసి ఆ ప్రాంతంలో నివసిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ALSO READ: Garbage Dump Protest: జీతాలు ఆపేశారని ఆగ్రహం.. పంచాయతీ కార్యాలయం ముందే చెత్త పోసిన పారిశుద్ధ్య కార్మికులు

నిందితులు కూడా అదే ప్రాంతానికి చెందినవారని గుర్తించారు. ఈ ఘటనపై విచారణ జరిపి, తదుపరి న్యాయపరమైన చర్యల కోసం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ముగ్గురు అరెస్ట్, ఇద్దరి కోసం గాలింపు

ప్రస్తుతం బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. ఆమెకు ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. నిందితులు, బాధితురాలికి మధ్య గతంలో పరిచయం ఉందా అనే కోణంలో కూడా తాము దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ బాబా తెలిపారు.

నిందితుల్లో ముగ్గురిని – కార్తీక్, గ్లెన్, మరియు సుయోగ్ – గా గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సామూహిక అత్యాచారం, దోపిడీ కింద కేసు నమోదు చేశారు.

ALSO READ:MLA Son Accident: ఎమ్మెల్యే మైనర్ కుమారుడి అరాచకం.. 150 కి.మీ వేగంతో కారుతో ఢీకొట్టి, బాధితుడిపై దాడికి యత్నం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad