Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుGarla: మైనర్ బాలిక అదృశ్యం

Garla: మైనర్ బాలిక అదృశ్యం

17 ఏళ్ల గంగావత్ త్రివేణి మిస్సింగ్

గార్ల మండలం చిన్న కిష్టాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని చంద్రగిరి గ్రామంలో నివసిస్తున్న గంగావత్ మల్సూర్ కుమార్తె గంగావత్ త్రివేణి (17) అనే మైనర్ బాలిక అదృశ్యమైన ఘటన చంద్రగిరి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చంద్రగిరి గ్రామానికి చెందిన గంగావత్ మల్సూర్ సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, రెండవ కుమార్తె త్రివేణి విశ్వశాంతి విద్యాలయంలో పదవ తరగతి చదువుతుంది. బుధవారం రాత్రి తల్లిదండ్రులతో త్రివేణి ఇంటి ముందు పడుకొని ఉంది మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి చూడగా కూతురు త్రివేణి కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారి బంధువుల స్నేహితుల ఇళ్లల్లో వెతకగా ఎంతకీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో గురువారం తండ్రి గంగావత్ మన్సూర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ జీనత్ కుమార్ తెలిపారు. బాలిక త్రివేణి అదృశ్యమైనప్పుడు నీలి రంగు దుస్తులు దరించి ఉందని బాలిక ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News