Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుDelhi Family Murder : దారుణం.. కుటుంబాన్ని నరికిన చంపిన యువకుడు

Delhi Family Murder : దారుణం.. కుటుంబాన్ని నరికిన చంపిన యువకుడు

దేశ రాజధాని ఢిల్లీలో వరుస దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. శ్రద్ధ హత్య కేసులో నిజానిజాలు పూర్తి తెలియరాకముందే.. మరో నలుగురి హత్యోదంతం కలకలం రేపింది. ఓ యువకుడు తన కుటుంబాన్ని నరికి చంపడంతో.. ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తల్లిదండ్రులు సహా చెల్లెలు, అమ్మమ్మను నరికి చంపేశాడు. మంగళవారం రాత్రి 10.31 గంటల సమయంలో ఈ వరుస హత్యలు జరిగినట్లు వారి కుటుంబసభ్యులు తెలిపారు.

- Advertisement -

పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. కేశవ్ (25) అనే యువకుడు మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడు. నిత్యం ఆ మత్తులోనే ఉండేవాడు. దాంతో కుటుంబ సభ్యులు అతడిని డ్రగ్స్ అడిక్షన్ సెంటర్ కు పంపారు. ఇటీవలే అక్కడి నుండి ఇంటికొచ్చిన కేశవ్ తన కుటుంబ సభ్యులపై పగ పెంచుకున్నాడు. మంగళవారం ఓ కత్తితో కుటుంబ సభ్యుల్ని పొడిచి చంపేశాడు. తొలుత తండ్రి దినేష్ కుమార్ (42)ను చంపి.. ఎవరికీ అనుమానం రాకుండా బాత్రూమ్ లో మృతదేహాన్ని ఉంచాడు. ఆ తర్వాత అమ్మమ్మ దీవానో దేవి (75)ని, ఉద్యోగానికి వెళ్లి ఇంటికొచ్చిన తల్లి ధర్శన్ సైనీ (40)ను, చెల్లెలు ఊర్వశి (22)ని హతమార్చాడు. అరగంటకు ఒకరిని చంపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణమని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు కేశవ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News