Eluru Accident Private Bus Two Died: ఈ రోజు రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఘటన మరువక ముందే ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న భారతి ట్రావెల్ బస్సు బోల్తా పడింది. లింగపాలెం మండలం జూబ్లీనగర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకోగా ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
- Advertisement -
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బస్సు బయలుదేరిన 20 నిమిషాలకే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.



