Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుAcid Attack : ప్రియురాలిపై అత్యాచారం.. ఆపై యాసిడ్ పోసి దారుణంగా..

Acid Attack : ప్రియురాలిపై అత్యాచారం.. ఆపై యాసిడ్ పోసి దారుణంగా..

ప్రియురాలిపై అత్యాచారం చేసి.. ఆపై ఆమె ముఖం గుర్తుపట్టకుండా యాసిడ్ పోసి కాల్చేసి.. దారుణంగా హతమార్చిన ఘటన జార్ఖండ్ లో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలిని పోస్టుమార్టమ్ కు పంపి.. నిందితుడు దాప్ నారాయణ్ సింగ్ అలియాస్ చర్కు ని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల యువతి రాంచీలోని ఓ కాలేజీలో పీజీ చదువుతోంది. కొన్ని నెలలుగా ఆమెకు దీప్ తో పరిచయం ఉంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. గత ఆదివారం (నవంబర్ 20)న ఆమె దీప్ తో కలిసి బయటికి వెళ్లింది. అప్పటి నుండి యువతి జాడ తెలియలేదు.

- Advertisement -

యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రెండ్రోజుల తర్వాత..లోహర్ దగా గ్రామానికి సమీపంలో ఉన్న రాతి క్వారీల సమీపంలో యువతి మృతదేహాన్ని గుర్తించారు. తల్లిదండ్రులు ఆమె దుస్తుల్ని గుర్తించడంతో.. ఆమె మిస్సైన యువతేనని కన్ఫర్మ్ చేసుకున్నారు. యువతిపై అత్యాచారం చేశాకే.. ఆమెను హతమార్చి ఉంటాడని అనుమానిస్తున్నారు. యువతి చేతులు, మెడపై గాయాలను గుర్తించారు. నిందితుడి నుండి యువతి విద్యార్హత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News