చేతికి వచ్చిన పంట కోసుకుందామని పొలానికి వెళ్దామంటే.. పొలానికి వెళ్లే దారే లేకుండా పోయిందని చాగలమర్రికి చెందిన ఓ రైతు తన గోడును స్పందనలో వెళ్లగక్కాడు.
- Advertisement -
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/10/51a94608-4f5c-4f8f-bd83-87660390821a-1024x576.jpg)
ఈమేరకు చాగలమర్రి ఎమ్మార్వోకు నగల్లపాడుకు చెందిన రైతులు పెద్ద దస్తగిరి, బాల దస్తగిరి , నాగేంద్ర కంప్లైంట్ ఇచ్చారు. స్థానిక రాజకీయ నేతలు, అధికారుల అండతో తన పొలానికి వెళ్లేందుకు దారి లేకుండా చేశారని బాధిత రైతు వాపోతున్నాడు.అధికారులు కూడా వారికే వత్తాసు పలకడం సమంజసం కాదని వాపోతున్నారు. స్పందనలో తన కష్టాన్ని చెప్పుకున్న రైతు సమస్యను అధికారులు ఎలా తీరుస్తారన్నది ఇప్పుడు స్థానికంగా అందరిలో ఆసక్తికలిగిస్తోంది.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/10/84599341-95a7-45c4-8cce-4f39d58b42cf-1024x576.jpg)