Cherlapalli: చర్లపల్లి సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. చర్లపల్లి- ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది.
బోడుప్పల్కు చెందిన వారిగా గుర్తింపు: చర్లపల్లిలో ఘోర విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మరణించిన వారు బోడుప్పల్కు చెందిన సురేందర్ రెడ్డి, విజయ, చేతనగా పోలీసులు గుర్తించారు. అయితే వారి మరణానికి గల కారణం ఇంకా తెలియరాలేదు.
Alss read-Crime: కోఠిలో కాల్పుల కలకలం.. ఏటీఎం వద్ద నగదు డిపాజిట్ చేస్తున్న వ్యక్తిపై దాడి!
దర్యాప్తు చేపట్టిన పోలీసులు: ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని స్థానికులు పోలీసులకు అందించారు. దీంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

