HomeTop StoriesCrime: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో కామాంధుడు హతం

Crime: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో కామాంధుడు హతం

Police encounter Rapist in UP: ఉత్తరప్రదేశ్‌లో నరరూప రాక్షసుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. ఘాజియాబాద్‌ జిల్లాకు చెందిన జీషన్‌.. కోడలు వరుసయ్యే నాలుగేళ్ల చిన్నారిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి అనంతరం గొంతునులిమి చంపాడు. అనంతరం పారిపోగా తాజాగా పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఆ కిరాతకుడు మరణించాడు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/private-bus-falls-into-valley-in-jammu-and-kashmir-16-dead/

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నాలుగేళ్ల పసిపాపపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితుడు జీషన్‌ను పోలీసులు ఆదివారం రాత్రి ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. ఏప్రిల్ 11న ఘాజియాబాద్‌లోని తీలా మోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు చాక్లెట్లు ఇప్పిస్తానని నమ్మించి బాలికను తన గదికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ఒక కారు కింద దాచి పరారయ్యాడు.

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/vijay-divorce-case-family-court-orders-couple-to-attend-hearing-in-june/

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు ఎనిమిది రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు రూ. 50,000 రివార్డు ప్రకటించారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తీలా మోర్ ప్రాంతంలో నిందితుడు పోలీసులకు తారసపడగా..  లొంగిపోవాలని కోరారు. అయితే అతను పోలీసులపై కాల్పులు జరపగా.. ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు మరణించగా.. ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. పోలీసుల చర్యతో తమకు న్యాయం జరిగిందని బాలిక తండ్రి హర్షం వ్యక్తం చేశారు. కాగా, నిందితుడిపై గతంలో కూడా నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News