Sunday, November 16, 2025
Homeనేరాలు-ఘోరాలుWife kills Husband: ప్రియుడితో సరసం.. భర్త శవం సరస్సులో!

Wife kills Husband: ప్రియుడితో సరసం.. భర్త శవం సరస్సులో!

Wife Murders Husband With Lovers Help: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కాటికి పంపింది ఓ ఇల్లాలు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి, ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా భర్తను హతమార్చింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు, అది ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, ‘నేరం ఎప్పటికీ దాగదు’ అన్నట్లుగా, పోలీసులు తమదైన శైలిలో జరిపిన దర్యాప్తులో అసలు బండారం బయటపడింది. కర్ణాటకలోని హావేరి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన, సినిమాల్లోని క్రైమ్ థ్రిల్లర్ కథను తలపిస్తోంది. అసలు స్నేహం ముసుగులో జరిగిన ఆ ఘాతుకం ఎలా బయటపడింది..? అమాయకుడి ప్రాణం తీసిన ఆ కిరాతకుల పాలిట ఏ చిన్న ఆధారం శాపంగా మారింది..?

- Advertisement -

నమ్మించి గొంతు కోసిన వైనం:

హావేరి జిల్లా, రట్టిహళ్లి తాలూకాకు చెందిన షహీనా బానుకు హరిహర్‌కు చెందిన షఫీవుల్లా అబ్దుల్ మహీబ్ (38)తో వివాహమైంది. అయితే, షహీనాకు అదే ప్రాంతానికి చెందిన ముబారక్ కలందర్ సాహబ్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ సంబంధం రోజురోజుకు ముదిరి, ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ముబారక్‌ను పెళ్లి చేసుకోవాలని షహీనా కోరగా, ఆమె భర్త షఫీవుల్లా అడ్డుగా ఉన్నాడని ఇద్దరూ భావించారు. దీంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని అత్యంత పాశవికంగా పథకం పన్నారు.

ALSO READ: https://teluguprabha.net/crime-news/nurse-dies-by-suicide-after-blackmail-in-nelamangala-accused-arrested/

పథకం ప్రకారం… ప్రాణాలు తీశారు:

తమ దుర్మార్గపు ప్రణాళికను అమలు చేయడానికి, నిందితుడు ముబారక్ ముందుగా షఫీవుల్లాతో స్నేహం నటించాడు. అతని నమ్మకాన్ని చూరగొని, తరచూ ఇంటికి వచ్చి కలుస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో, పథకం ప్రకారం జూలై 27వ తేదీన పార్టీ చేసుకుందామనే నెపంతో షఫీవుల్లాను సమీపంలోని సరస్సు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ముగ్గురూ కలిసి మద్యం సేవించారు.

మద్యం మత్తులో జోగుతున్న షఫీవుల్లాను, షహీనా,  ముబారక్ కలిసి అమాంతం సరస్సులోకి తోసేశారు. నీటిలో మునిగి అతను ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత, తమకేమీ తెలియనట్లు, షఫీవుల్లా ఆత్మహత్య చేసుకున్నాడని నాటకమాడారు.

ALSO READ: https://teluguprabha.net/crime-news/bones-found-from-sixth-site-in-dharmasthala-mass-burial-case/

ఒంటిపై గాయాలే పట్టించాయి:

సరస్సులో మృతదేహం లభ్యమైన తర్వాత, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తొలుత ఆత్మహత్యగానే భావించినప్పటికీ, మృతదేహంపై ఉన్న గాయాలను చూసి అనుమానం కలిగింది. ఆత్మహత్య చేసుకుంటే ఉండే గాయాలకు, శరీరంపై ఉన్న గాయాలకు పొంతన లేకపోవడంతో ఇది హత్యేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో భార్య షహీనా, ఆమె ప్రియుడు ముబారక్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, వారు చేసిన దారుణాన్ని అంగీకరించారు. ప్రియుడితో కలిసి జీవించేందుకే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ప్రస్తుతం హిరేకెరూర్ పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad