Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుCrime News: దారుణం.. భార్యపై అనుమానంతో భర్త ఏం చేశాడంటే?

Crime News: దారుణం.. భార్యపై అనుమానంతో భర్త ఏం చేశాడంటే?

Husband Killed wife: వరంగల్ జిల్లా బాలాజీ నగర్‌లో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. యూపీ (ఉత్తర ప్రదేశ్)కి చెందిన రితీశ్ సింగ్ అనే వ్యక్తి.. తన భార్య రేష్మ వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో హత్య చేశాడు.

- Advertisement -

మొదట్లో అంతా ఓకే.. కానీ తర్వాతే..
రితీశ్ సింగ్, రేష్మ కొంతకాలం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. రేష్మ బాలానగర్‌కు చెందిన వ్యక్తికాగా, రితీశ్ యూపీ నుంచి వచ్చినట్లు తెలిసింది. మొదట్లో అంతా సక్రమంగానే సాగినా కాలక్రమంలో వివాదాలకు తెరతీసింది వీరి దాంపత్య జీవితం. ఈ నేపథ్యంలోనే గత కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రితీశ్ సింగ్.. తన భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధాలు ఉన్నాయని అనుమానించడంతో ఆమెను మానసికంగా కూడా హింసించినట్లు సమాచారం.

Also Read:https://teluguprabha.net/crime-news/chhattisgarh-feast-tragedy-food-poisoning-korba/

హత్యకు దారితీసిన సంఘటనలు
పోలీసుల సమాచారం ప్రకారం, రితీశ్ సింగ్ అనుమానంతో రోజురోజుకి రేష్మను శారీరకంగా, మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. ఈ గొడవల నేపథ్యంలోనే రితీశ్.. రేష్మను హత్య చేసినట్లు తెలుస్తోంది.

రంగంలోకి పోలీసులు
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వరంగల్ పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్య వెనక ఉన్న పూర్తి వివరాలను తెలుసుకోవడానికి సాక్ష్యాల సేకరణకు దర్యాప్తు చేపట్టారు.

Also Read: https://teluguprabha.net/crime-news/haveri-wife-murders-husband-lover-crime/

సమాజంపై ప్రభావం
ఈ ఘటన మరోసారి స్థానికంగా, సామాజిక మాధ్యమాల్లో ఆందోళనకర చర్చలకు దారితీసింది. భర్త భార్యల మధ్య నమ్మకం, అవగాహన లేకపోవడంతోనే ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad