Janagama Gangrape Case: జనగామ టౌన్లో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై 10 మంది యువకులు సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జనగామ జిల్లాలో స్థానికంగా వ్యాపారం నిర్వహిస్తున్న ఓ వ్యాపారి కుమారుడు ఓ బాలికతో పరిచయం పెంచుకొని, మాయమాటలతో నమ్మించాడు. తన స్నేహితులతో కలిసి జులైలో ఆమెను గోవాకు తీసుకెళ్లి, అక్కడ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తిరిగి జనగామకు తీసుకొచ్చాడు. అయితే కొన్ని రోజులకే ఈ యువకుల మధ్య గొడవ జరగడంతో, అందులో కొందరు ఈ ఘటనను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ విషయం వైరల్ కావడంతో పోలీసులు బాలికను విచారించగా, ఆమె అత్యాచార విషయాన్ని ధ్రువీకరించింది. అయితే బాలికకు తల్లిదండ్రులు లేనట్లు తెలుస్తోంది.
ALSO READ : Holidays for students: ఈ వారంలో 3 రోజుల సెలవులు: ఎగిరి గంతేస్తున్న విద్యార్థులు..!
ఇక ఇప్పటికే ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుండటంతో.. సమాజంలో యువత తీరుపై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సభ్య సమాజం తలదించుకునేలా ఈ ఘటనలకు ఎందరో యవతులు బలైపోతున్నారు. ఈ విషయంపై తగిన చర్యలు సైతం తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


