Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుKarimnagar: మద్యం మత్తులో డ్రైవింగ్ తోనే ప్రమాదాలు

Karimnagar: మద్యం మత్తులో డ్రైవింగ్ తోనే ప్రమాదాలు

మద్యం సేవించి వాహనాలు నడుపడం వల్లనే ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అడిషనల్ డిసిపి (శాంతిభద్రతలు) ఎస్ శ్రీనివాస్ అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడ్డ వారికి జరిమానాలతో పాటు జైలుశిక్షలు తప్పవని స్పష్టం చేశారు. మద్యం సేవించి ఈ మధ్యకాలంలో పట్టుబడిన వాహనదారులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కమిషనరేట్ కేంద్రంలోని ఓపెన్ థియేటర్ ఆవరణలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డిసిపి (శాంతిభద్రతలు) ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు పాల్పడటాన్ని హత్యానేరం కన్నా తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపడం వల్ల స్వయంగా ప్రమాదాలకు గురవ్వడంతోపాటు ఇతరులకు ఢీకునడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. మద్యంమత్తులో మెదడు పనిచేయక, శరీరం ఆధీనంలో ఉండక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపడం వల్ల శరీరభాగాలు విరగడం, తలకు తీవ్రమైన గాయాలు కావడం, మరికొందరు జీవచ్ఛవాలుగా మారి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మద్యంమత్తులో జరుగుతన్న ప్రమాదాలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చుతుండగా మరికొందరి కుటుంబాలు అనాధలుగా మిగులుతున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపి రెండవసారి పట్టుబడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు వారి లైసెన్సులను రద్దుచేసేందుకు. సిఫారసు చేస్తామని హెచ్చరించారు. పోలీసు కేసులు నమోదైతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించకపోవడమే కాకుండా పాస్ పోర్టులు లభించవని చెప్పారు. ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనాలు నడుపుతుండటం వల్లనే ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. రోడ్డు నియమ నిబంధనలు పాటించకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. మద్యం సేవించి పట్టుబడిన వాహనదారులతో తాము మళ్ళీ మద్యం సేవించి వాహనాలు నడుపబోమని ప్రతిజ్ఞ చేయించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపిఎస్ అధికారి గైట్ మహేష్ బాబాసాహెబ్, ఏసిపి బి విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్లు తిరుమల్, దామోదర్ రెడ్డి, నటేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News