Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుBrutal Murder in Kurnool: ఒంటరి వృద్ధురాలిని చితకబాది చంపిన దుండగులు!

Brutal Murder in Kurnool: ఒంటరి వృద్ధురాలిని చితకబాది చంపిన దుండగులు!

Elderly woman murdered in Kurnool : కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నవాళ్లను చూసుకోవడానికి కేర్ టేకర్లను, ఇంటి పనుల కోసం పని మనుషులను పెట్టుకోవడం నేటి ఆధునిక జీవనశైలిలో సర్వసాధారణమైపోయింది. కానీ, మనం నమ్మకంతో ఇంట్లోకి రానిచ్చిన వారే, మన పాలిట యమపాశమైతే ఆ పరిస్థితి ఊహించుకోండి…? వారే మన పెద్దవాళ్ల ప్రాణాలనే బలి తీసుకుంటే.? కర్నూలు నగరంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఓ దారుణ ఘటనే ఇందుకు నిలువుటద్దం పడుతోంది. 75 ఏళ్ల వృద్ధురాలిని అత్యంత పాశవికంగా హతమార్చిన ఈ ఉదంతం, ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న వృద్ధుల భద్రతపై, పని మనుషుల విశ్వసనీయతపై తీవ్రమైన ప్రశ్నలను రేకెత్తిస్తోంది.

- Advertisement -

కూతురి ఇంట్లో ఘోరం: కర్నూలు నగరంలోని సాయి వైభవ్ నగర్‌లో నివాసముంటున్న కాటసాని శివలీల (75) అనే వృద్ధురాలు, తన కూతురు ఉమామహేశ్వరి, అల్లుడు చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఉంటున్నారు. ఆమె భర్త సాంబశివరెడ్డి ఇటీవలే మరణించారు. కుమారుడు గంగాధర్ రెడ్డి అమెరికాలో వైద్యుడిగా స్థిరపడగా, కూతురు స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

రక్తపు మడుగులో తల్లి: మంగళవారం (సెప్టెంబర్ 2) తెల్లవారుజామున, అల్లుడు చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో చూడగా, అత్త శివలీల తీవ్ర రక్తస్రావంతో, అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

బంగారం కోసమేనా ఈ దారుణం : పోలీసుల ప్రాథమిక విచారణలో ఇది హత్యగా తేలింది.
నగల మాయం: శివలీల మెడలో, చేతులకు ఉండాల్సిన బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో, బంగారం కోసమే దుండగులు ఆమెను తీవ్రంగా కొట్టి, హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

పనిమనిషిపై అనుమానం: ఇంట్లో గత కొంతకాలంగా వరలక్ష్మి అనే మహిళ పనిమనిషిగా చేస్తూ, సరిగ్గా మూడు రోజుల క్రితమే పని మానేసింది. ఆమెపైనే తమకు అనుమానంగా ఉందని మృతురాలి కూతురు ఉమామహేశ్వరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దర్యాప్తునకు సీసీ కెమెరాల ఆటంకం: ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే, ఇంట్లోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడం దర్యాప్తునకు కొంత ఆటంకంగా మారింది. అయినప్పటికీ, పోలీసులు పనిమనిషి కోణంతో పాటు, ఇతర కోణాల్లోనూ దర్యాప్తును ముమ్మరం  చేశారు. ఈ దారుణ హత్యతో కర్నూల్ నగరంలోని వృద్ధులు, ఒంటరిగా ఉంటున్న వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad