Sunday, October 6, 2024
Homeనేరాలు-ఘోరాలుLaptop thieves: అంతరాష్ట్ర ల్యాప్ టాప్ దొంగలు

Laptop thieves: అంతరాష్ట్ర ల్యాప్ టాప్ దొంగలు

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపునగర్ లోని ఓ హాస్టల్ లో నివాసం ఉంటున్న మణిశేఖర్ అతని రూమ్ మెట్ బ్రహ్మారెడ్డిలు గత నెల 29వ తారీకున తమ హాస్టల్ లో తమ ఆఫీస్ ల్యాప్టాప్ లను పక్కన ఉంచుకొని నిద్రిస్తున్నారు. కాగా ఉదయం సుమారు 5 గంటల ప్రాంతాన లేచి చూడగా తమ ల్యాప్టాప్ లు కనిపించకుండా పోయాయి. వెంటనే వారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపారు.

- Advertisement -

సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా తమిళనాడు రాష్ట్రం అంభూర్ జిల్లాకు చెందిన దీనా(21), సౌందరాజన్(21), సారథి(20), నటరాజన్(20) లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 14 ల్యాప్టాప్ లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ క్రమంలో వారిని విచారించగా సులభంగా డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో హైదరాబాద్ నగరానికి వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్సార్ నగర్  పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు హాస్టల్లో 15 ల్యాప్టాప్ లను దొంగిలించి ఒక ల్యాప్టాప్ ను దారిన వెళ్లే ఒక వ్యక్తికి తక్కువ ధరకు విక్రయించినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News