Sunday, July 7, 2024
Homeనేరాలు-ఘోరాలుJharkhand Woman: భార్యను చంపి 12 ముక్కలుగా నరికిన భర్త.. శరీర భాగాలు స్వాధీనం చేసుకున్న...

Jharkhand Woman: భార్యను చంపి 12 ముక్కలుగా నరికిన భర్త.. శరీర భాగాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

Jharkhand Woman: ఝార్ఖండ్‌లో దారుణం జరిగింది. ఒక వ్యక్తి తన భార్యను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని 12 ముక్కలుగా నరికాడు. ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్ రాష్ట్రం, షేబ్గంజ్ ప్రాంతంలోని బొరియో పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఈ ఘటన జరిగింది.

- Advertisement -

ఇదే ప్రాంతానికి చెందిన దిల్దార్ అన్సారి అనే వ్యక్తి, రుబికా పహదిన్ అనే 22 ఏళ్ల యువతి కొంతకాలం క్రితం పెళ్లి చేసుకున్నారు. రుబికా, అన్సారికి రెండో భార్య. అంతకుముందే అతడికి మరో మహిళతో వివాహమైంది. కొంతకాలం రుబికా-దిల్దార్ బాగానే ఉన్నారు. అయితే, ఇద్దరిమధ్యా ఇటీవలి కాలంలో గొడవలు జరుగతున్నాయి. వైవాహిక జీవితానికి సంబంధించి గొడవలు జరుగుతున్నాయి. దీంతో కోపం తెచ్చుకున్న దిల్దార్ తన భార్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల పదునైన కత్తితో ఆమె గొంతుకోసి చంపేశాడు. తర్వాత ఆమె మృతదేహాన్ని 12 ముక్కలుగా నరికాడు. అనంతరం ముక్కలుగా నరికిన మృతదేహాన్ని పాడుబడిన ఇంట్లో పడేశాడు.

అయితే, రుబికా కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. ఆమె భర్తపై అనుమానం వచ్చి విచారించగా, తను చేసిన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు శరీర భాగాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కొన్ని శరీర భాగాలు లభించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News