Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుMulugu:టేకు స్మగ్లింగ్, డ్రైవర్ పరారీ

Mulugu:టేకు స్మగ్లింగ్, డ్రైవర్ పరారీ

అటవి అధికారుల కళ్ళుగప్పి వీరప్పన్ చందనం చక్కలను తరలించడంలో విభిన్న మార్గంలో ఎవరికి అంతుచిక్కని ఊహకు అందని మార్గాలను ఎంచుకొని అక్రమ వ్యాపారాన్ని సజావుగా కొనసాగిస్తుంటాడు. అలాంటి తరుణంలో ములుగు జిల్లా, వాజేడు మండలం, చతిష్ ఘడ్ రాష్ట్ర సరిహద్దు అటవి ప్రాంతంలో శుక్రవారం నాడు చోటు చేసుకుంది. సుమారు ఐదు లక్షల రూపాయలు విలువచేసే టేకు కలపను ముందుగానే లారీలో అమర్చి, అనుమానం రాకుండా అనుకున్న ప్లాన్ ప్రకారం వాటిపై ఇసుకను నింపి చతిస్గడ్ నుండి మైదాన ప్రాంతాలకు తరలించే క్రమంలో అటవీ అధికారుల చేతికి చిక్కారు. అధికారులకు ముందుగానే అందిన సమాచారంతో పలుచోట్ల మాటేసిన అధికారుల చర నుండి తప్పించుకునేందుకు టేకులగూడెం అటవీ ప్రాంగణంలో సేద తీరుతున్న వాహనాన్ని గుర్తించి అటవీ నిఘా బృందం పట్టుకున్నారు. అటవీ అధికారులను గమనించిన లారీ డ్రైవర్ వాహనాన్ని విడి పరారైనట్లు అటవీ రేంజ్ అధికారి చంద్రమౌళి తెలిపారు. పట్టుకున్న వాహనాన్ని వెంకటాపురం రేంజ్ కార్యాలయానికి అధికారులు తరలించారు. లారీ పట్టుబడ్డ ప్రాంతం కృష్ణాపురం సెక్షన్ పరిధిలో కేసు నమోదు చేసినట్టు మీడియాకు తెలిపారు. వెంకటాపురం, వాజేడు మండలాలలో ఇసుక లారీలు అధికంగా ప్రయాణిస్తుండడం చేత ఎవరికి అనుమానం కలగదనే ఉద్దేశంతో దుండగుల ఈ అక్రమ మార్గాన్ని అనుసరించరని తెలుస్తుంది.అటవీ నిఘా బృందం చెక్ పెట్టడంతో పలువురు అధికారుల పనితీరును ప్రశంసిస్తున్నారు.టేకు స్మగ్లింగ్ ను చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురైనట్టు తెలుస్తుంది. ముందు ముందు ఇలాంటి అక్రమాలు జారకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News