Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుNewborns Die: అమానుషం.. ఆసుపత్రిలో ఎలుకల కాటుకు ఇద్దరు పసికందుల మృతి

Newborns Die: అమానుషం.. ఆసుపత్రిలో ఎలుకల కాటుకు ఇద్దరు పసికందుల మృతి

Rats Attack, 2 Newborns Die: సాధారణంగా ఆసుపత్రి అంటే నవజాత శిశువులకు సురక్షితమైన ప్రదేశం. కానీ మధ్యప్రదేశ్‌లోని మహారాజా యశ్వంత్‌రావ్ ఆసుపత్రిలో మాత్రం రెండు పసిప్రాణాలు అమానుషంగా బలైపోయాయి. ఎలుకల కాటుకు గురైన ఇద్దరు పసికందులు రెండు రోజుల వ్యవధిలో మరణించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టింది.

- Advertisement -

ALSO READ: Traffic Jam : ఎంత కష్టం వచ్చింది.. హై ట్రాఫిక్ జామ్‌.. అంబులెన్స్ లోనే విలవిల్లాడుతూ!

అక్కడ ఆశ, ఇక్కడ విషాదం

ఖండ్వా, దేవాస్ జిల్లాల నుంచి వచ్చిన ఆ రెండు కుటుంబాలకు తమ బిడ్డలు బతుకుతారనే ఆశతో ఈ ఆసుపత్రికి వచ్చారు. కానీ వారి ఆశలు ఆవిరైపోయాయి. ఒక పదిహేను రోజుల పసికందు, మరొక చిన్నారికి ఎలుకలు కరిచాయి. ఆసుపత్రి వర్గాలు ఎలుకల కాటు స్వల్పమని, చిన్నారులు జన్యుపరమైన రక్తహీనతతో చనిపోయారని చెబుతున్నాయి. కానీ, రెండు మరణాలు ఒకే కారణంతో జరగడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఆసుపత్రిలో పసికందుల వార్డులోనే ఎలుకలు ఎలా తిరుగుతున్నాయని, వాటి నుంచి పసిపిల్లలకు రక్షణ కల్పించలేకపోవడం దారుణమని ప్రజలు మండిపడుతున్నారు.

ALSO READ:  Man Kills Minor Fiancée: మైనర్‌తో ప్రేమ.. నిశ్చితార్థం.. గొడవపడి గొంతు నులిమి చంపేసిన ప్రియుడు

అధికారుల నిర్లక్ష్యం, రాజకీయాల రగడ

ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి హడావుడిగా చర్యలు తీసుకుంది. పురుగుల నివారణ ఏజెన్సీపై రూ.1 లక్ష జరిమానా, నర్సింగ్ సూపరింటెండెంట్‌పై వేటు, ఇద్దరు నర్సింగ్ అధికారుల సస్పెన్షన్‌తో చేతులు దులుపుకుంది. అయితే, ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ చర్యలు కేవలం నామమాత్రమేనని విమర్శించింది. “చిన్నారులను హాని చేసింది ఎలుకలు కాదు, అవినీతిమయమైన ప్రభుత్వ యంత్రాంగం” అని కాంగ్రెస్ నేత జీతు పట్వారీ అన్నారు. పెద్ద అధికారులు, మంత్రులపై చర్యలు తీసుకోకుండా చిన్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం సరికాదని ఆయన విమర్శించారు.

గతంలోనూ ఇలాంటి ఘటనలు

మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితి బయటపడటం ఇదే మొదటిసారి  కాదు. గత ఏడాది భోపాల్, సాగర్, విదిషా వంటి చోట్ల శవాగారాల్లోని మృతదేహాలను ఎలుకలు కొరికిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయినా ఆసుపత్రుల నిర్వహణలో మార్పు రాలేదు. అప్పటి నిర్లక్ష్యమే ఇప్పుడు రెండు అమాయక ప్రాణాలను బలిగొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: Instagram Filter: ఫిల్టర్లు వాడి వయసు దాచిన 52 ఏళ్ల మహిళ.. పెళ్లికి ఒత్తిడి చేయడంతో హతమార్చిన యువకుడు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad