Bike hits RTC bus: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే, యూటర్న్ తీసుకుంటున్న ఆర్టీసీ బస్సును ఓ బైక్ అతివేగంతో ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు మరియు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరు యువకులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం:
బాధితుల తలకు బలమైన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో బైక్ అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని వెల్లడైంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు:
ఈ మధ్య ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే.. ఇవి జరగకుండా నివారించవచ్చు.
స్పీడ్ లిమిట్ ను పాటించండి:
నిర్ణీత వేగ పరిమితిని మించి వాహనం నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణం. ముఖ్యంగా యూటర్న్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి.
హెల్మెట్ ధరించండి:
ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు, వెనుక కూర్చున్నవారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఇది తలకు బలమైన గాయాలు కాకుండా రక్షిస్తుంది.
ట్రాఫిక్ నిబంధనలు పాటించండి:
ట్రాఫిక్ సిగ్నల్స్, సైన్బోర్డులు, లేన్ డిసిప్లిన్ను తప్పనిసరిగా పాటించాలి.
అప్రమత్తంగా ఉండండి:
రోడ్డుపై దృష్టి సారించి, ఇతర వాహనాలను, పాదచారులను గమనిస్తూ డ్రైవ్ చేయాలి. మొబైల్ ఫోన్లు వాడటం వంటివి లేకుండా చూసుకోవాలి.
వీటితో పాటు మీ వాహనాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేయించుకోవాలి. బ్రేకులు, టైర్లు, లైట్లు వంటివి సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి.
రోడ్డు భద్రత అనేది ప్రతి పౌరుడి బాధ్యత. నిర్లక్ష్యం ప్రాణాల మీదికి తెస్తుందని గుర్తుంచుకోవాలి.