Sunday, July 7, 2024
Homeనేరాలు-ఘోరాలుShocking: ఉరి కంభంపై నవ వధువు

Shocking: ఉరి కంభంపై నవ వధువు

ఉరి కంభంపై నవ వధువు విగత జీవిగా కనిపించటం స్థానికంగా అందరినీ కలిచివేసింది. హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లోని రాజేంద్రనగర్ అత్తాపూర్ లో ఈ విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నవ వధువు పుష్పాంజలి ఫ్యానుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఎంతకీ భార్య తలుపులు తెరవక పోవడంతో భర్త తలుపులు బద్దలు కొట్టి చూడగా పుష్పాంజలి వేలాడుతూ కనిపించగా స్థానిక అత్తాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పుష్పాంజలి మృతికి కారణాలు ఇంకా తెలియ రాలేదు. 8 నెలల క్రితం అత్తాపూర్ కు చెందిన కిరణ్ కుమార్ తో పుష్పాంజలికి వివాహం జరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News