Sunday, October 6, 2024
Homeనేరాలు-ఘోరాలుShraddha Walkar: గర్ల్ ఫ్రెండ్ తల 3 నెలల తరువాత విసిరేసి..ఎముకలు మిక్సీలో పొడి చేసి..

Shraddha Walkar: గర్ల్ ఫ్రెండ్ తల 3 నెలల తరువాత విసిరేసి..ఎముకలు మిక్సీలో పొడి చేసి..

శ్రద్ధా వాకర్ కేసు సృష్టించిన సంచలనం ఇప్పట్లో ఎవరూ మరిచిపోలేరు. ఆఫ్తాబ్ పూనావాలా అనే యువకుడితో సహజీవనం చేసిన పాపానికి అతడి చేతుల్లోనే ప్రాణాలు పోగొట్టుకుంది ఈ అమాయకపు పిల్ల. అయితే ఆఫ్తాబ్ అరెస్టు చేసినా అతనిలో పశ్చాత్తాపపు జాడలు ఏవీ లేకపోగా.. అతన్ని కదిలిస్తే అన్నీ సంచలనాలే వెలుగులోకి వస్తున్నాయి.

- Advertisement -

శ్రద్ధాను ముక్కలు కోసి నరికాక..ఇంట్లోనే పెద్ద ఫ్రిజ్జులో దాచిన ఆఫ్తాబ్.. మూడు నెలల తరువాత ఆమె తలను విసిరేశాడు. ఆమె శరీరంలోని ఎముకలను మిక్సీలో వేసి పొడి చేశాడు. ఇలా చేసే ఆధారాలు లేకుండా అతి తెలివి ప్రయోగించాడు కిరాతక ఆఫ్తాబ్ అంటూ ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. పోలీసులు ఆఫ్తాబ్ మీద 6,600 పేజీల ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. వాటిలో ఆఫ్తాబ్ దారుణాలు వెలుగులోకి వచ్చాయి.

ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా కోసినట్టు ఆతరువాతి వారాల్లో వాటిని ఒక్కొక్కదాన్ని పారేస్తూ వచ్చినట్టు పోలీసులకు ఆఫ్తాబ్ తెలిపాడు. అయితే ఆమె శరీరంలోని 20 ముక్కలకంటే తక్కువ ముక్కలను పోలీసులు కనుగొని వాటిపై డీఎన్ఏ పరీక్షలు చేసి నిర్ధారణకు వచ్చారు. పాలీగ్రాఫ్, నార్కో అనాలిసిస్ టెస్టుల్లో తాను శ్రద్ధా వాకర్ ను హత్య చేసినట్టు అతను అంగీకరించాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News