Monday, March 10, 2025
Homeనేరాలు-ఘోరాలుViveka: వివేకా హత్య కేసులో కీలక సాక్షి, వాచ్ మెన్ రంగన్న మృతిపై ఎస్పీ అశోక్...

Viveka: వివేకా హత్య కేసులో కీలక సాక్షి, వాచ్ మెన్ రంగన్న మృతిపై ఎస్పీ అశోక్ కుమార్ ప్రకటన

మాజీ మంత్రి వై.ఎస్ వివేకానంద రెడ్డి ( YS Vivekanandha Reddy) హత్య కేసులో ప్రధాన సాక్షి, వాచ్ మాన్ గా పనిచేసిన రంగయ్య అనే వ్యక్తి అస్వస్థతతో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం రిమ్స్ లో మరణించడం జరిగిందని, బుధవారం మధ్యాహ్నం పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లడం జరిగిందని, అక్కడి నుండి రిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని జిల్లా ఎస్.పి ఇ.జి అశోక్ కుమార్ మీడియాకు తెలిపారు.

- Advertisement -

వాచ్ మాన్ రంగయ్య మృతిపై రంగయ్య భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఎస్.పి తెలిపారు. వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి మరణించడం హై ప్రొఫెషనల్ మర్డర్ గా మేము భావిస్తున్నాము. రంగయ్య మరణం వెనుక ఎవరి ప్రమేయం ఉంది.ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని జిల్లా ఎస్.పి పేర్కొన్నారు.

దీంట్లో భాగంగా 2014 సం. నుండి 2024 మధ్య హత్య కేసులోని 6 మంది ప్రధానమైన సాక్షులు చనిపోవడం జరిగింది. 2019 లో శ్రీనివాస రెడ్డి, శంకర్ రెడ్డి, 2022 లో గంగాధర రెడ్డి, 2024 సెప్టెంబర్ లో వై.ఎస్ అభిషేక్ రెడ్డి, నారాయణ ఇప్పుడు రంగయ్య మరణించడం జరిగిందన్నారు. గతంలో వై.ఎస్ వివేకా హత్య కేసులో సాక్షులు మరణించినపుడు పోలీసు వల్ల, సి.బి.ఐ వల్ల చనిపోయారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని, దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, దీని వెనుక ఎవరున్నారు..ఎందుకిలా చేస్తున్నారు.

ప్రధానమైన కేసును కప్పి పుచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా..అనే అంశాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు. దర్యాప్తు కు ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్.పి తెలిపారు. కేసును శాస్త్రీయంగా, డాక్యుమెంట్ లను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందన్నారు. వివేకా హత్య కేసులో సాక్షులెవరికైనా తమ ప్రాణాలకు ముప్పు ఉందని భావిస్తే తమకు ఫిర్యాదు చేస్తే పరిశీలించి అవసరమైతే రక్షణ కల్పిస్తామని ఎస్.పి తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News