Tuesday, July 2, 2024
Homeనేరాలు-ఘోరాలుRajasthan: పెళ్లి వేడుకలో విషాదం.. సిలిండర్ పేలి ఐదుగురు మృతి.. 54 మందికి గాయాలు

Rajasthan: పెళ్లి వేడుకలో విషాదం.. సిలిండర్ పేలి ఐదుగురు మృతి.. 54 మందికి గాయాలు

Rajasthan: రాజస్థాన్‌లోని ఒక పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. వంట కోసం ఉపయోగించే సిలిండర్ పేలడంతో ఐదుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్రాంతం, భుంగ్రా గ్రామంలో శుక్రవారం జరిగింది.

- Advertisement -

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెళ్లి వేడుక కోసం వరుడి ఇంట్లో బంధువులంతా గుమిగూడి ఉన్నారు. వారి కోసం పక్కనే ఒక గదిలో వంటలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో గ్యాస్ లీక్ కావడంతో సిలింబర్ బ్లాస్ట్ అయింది. ఈ పేలుడు ధాటికి ఐదుగురు మరణించారు. 52 మంది గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

పేలుడు ధాటికి ఇల్లు సగభాగం కూలిపోయిందంటే ఆ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనపై రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News