Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుMother Kills Son: ఇన్సూరెన్స్ డబ్బు కోసం కొడుకును చంపిన తల్లి, ప్రియుడు.. డిన్నర్ పేరుతో...

Mother Kills Son: ఇన్సూరెన్స్ డబ్బు కోసం కొడుకును చంపిన తల్లి, ప్రియుడు.. డిన్నర్ పేరుతో తీసుకెళ్లి ఘాతుకం!

Woman, Lover Kill Son For Insurance Money: ఉత్తరప్రదేశ్‌లో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. తమ అక్రమ సంబంధాన్ని వ్యతిరేకించాడని, అతని పేరిట ఉన్న ఇన్సూరెన్స్ డబ్బును పొందాలనే దురుద్దేశంతో ఒక మహిళ తన 23 ఏళ్ల కొడుకును ప్రియుడు, అతని సోదరుడితో కలిసి హత్య చేసింది. అంతేకాక ఈ నేరాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు.

- Advertisement -

బంధానికి అడ్డొచ్చాడని..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు ప్రదీప్ శర్మ మృతదేహం అక్టోబర్ 26న కాన్పూర్-ఇటావా హైవేపై లభించింది. మొదట ఇది రోడ్డు ప్రమాదంగా భావించినా, పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది.

ప్రదీప్ తండ్రి మరణించిన తర్వాత, అతని తల్లి ప్రధాన నిందితుడు మయాంక్ అలియాస్ ఇషు కతియార్‌తో సంబంధం పెట్టుకుంది. ప్రదీప్ ఈ బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో తల్లికి దూరంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగం సంపాదించుకున్నాడు.

ALSO READ: Professor Arrest: భర్త చనిపోయిన మహిళకు ‘సహాయం’ పేరుతో లైంగిక వేధింపులు, ప్రొఫెసర్ అరెస్ట్

దీనిపై కోపం పెంచుకున్న ప్రదీప్ తల్లి, మయాంక్, అతని సోదరుడు రిషి కతియార్ కలిసి ప్రదీప్‌ను చంపడానికి ప్లాన్ చేశారు. పథకంలో భాగంగా, మయాంక్, రిషి కలిసి ప్రదీప్ పేరు మీద ఉద్దేశపూర్వకంగా అనేక భారీ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకున్నారు.

కారులో సుత్తితో కొట్టి హత్య

దీపావళి సెలవుల కోసం ప్రదీప్ ఇంటికి వచ్చినప్పుడు, అక్టోబర్ 26న మయాంక్, రిషి కలిసి అతన్ని డిన్నర్ కోసం తీసుకెళ్తున్నామని చెప్పి తమ వ్యాగనార్ కారులో ఎక్కించుకున్నారు. కారులో ప్రయాణిస్తున్నప్పుడు, ఇద్దరూ కలిసి సుత్తితో ప్రదీప్ తలపై పలుమార్లు కొట్టి అక్కడికక్కడే చంపేశారు.

ఆ తర్వాత, ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి, డెరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బలరామావు గ్రామ సమీపంలో కాన్పూర్-ఇటావా హైవేపై నిందితులు మృతదేహాన్ని పడేశారు.

ప్రదీప్ మృతదేహాన్ని గుర్తించిన తర్వాత, అతని అంకుల్, తాతయ్యలు రిషి, మయాంక్‌లపై హత్య ఆరోపణలు చేశారు. అయితే ప్రదీప్ తల్లి మాత్రం ఇది రోడ్డు ప్రమాదంగానే వాదించడం గమనార్హం.

ఎన్‌కౌంటర్‌తో పట్టుబడిన నిందితులు

“వివరాల దర్యాప్తులో ప్రదీప్ హత్యకు గురైనట్లు తేలింది. ఈ నేరానికి ఉపయోగించిన సుత్తి, ఆయుధం, కారును స్వాధీనం చేసుకున్నాం. మయాంక్, రిషి ఇద్దరూ ఎన్‌కౌంటర్ తర్వాత అరెస్టయ్యారు” అని డెరాపూర్ సర్కిల్ ఆఫీసర్ తెలిపారు.

పోలీస్ బృందంపై రిషి కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ జరిగిందని, పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో అతను గాయపడ్డాడని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad