Sunday, September 8, 2024
Homeనేరాలు-ఘోరాలుWoman stabbed: 20 ఏళ్లామె తనతో మాట్లాడలేదని.. 51 సార్లు స్క్రూ డ్రైవర్ తో పొడిచి..

Woman stabbed: 20 ఏళ్లామె తనతో మాట్లాడలేదని.. 51 సార్లు స్క్రూ డ్రైవర్ తో పొడిచి..

నోట్లో గుడ్డలు కుక్కాడు.. స్క్రూ డ్రైవర్ తీసుకున్నాడు..అంతే విచక్షణా రహితంగా దాంతో 51 సార్లు పొడిచాడు. దీంతో 20 ఏళ్ల మహిళ అర్ధాంతరంగా తనువు చాలించింది. ఘోరమైన ఈ ఘటనతో కోబ్రా ఉలిక్కి పడింది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని కోబ్రా జిల్లాలోని ఓ 20 ఏళ్ల మహిళ తనతో మాట్లాడేందుకు తిరస్కరించిందని ఆగ్రహించిన దుండగుడు ఆమెపై దాడికి ఒడిగట్టాడు. ఆతరువాత చాలాసేపటికి మృతురాలి సోదరుడు ఇంటికి రాగా రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను చూసి ఆసుపత్రికి తీసుకెళ్లగా మరణించినట్టు వైద్యులు తేల్చారు. కాగా గతంలో వీరద్దరూ మంచి ఫ్రెండ్స్ గా ఉండేవారని అతను బస్సు కండక్టరుగా ఉండగా ఆ బస్సులోనే ప్రయాణించిన ఆమెకు పరిచయం అయినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా మూడేళ్ల క్రితం నుంచి నిందితుడితో మాట్లాడటం మానేసిన ఆమెపై కసిని పెంచుకుని, పలుమార్లు ఆమె తల్లిదండ్రులను కూడా బెదిరించి, చివరికి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News