Sunday, October 6, 2024
HomeదైవంAhobilam: వైభవంగా స్వాతి వేడుకలు

Ahobilam: వైభవంగా స్వాతి వేడుకలు

పెద్ద ఎత్తున స్వాతి నక్షత్ర ఉత్సవాలకు వచ్చిన భక్తులు

ప్రసిద్ధ పవిత్ర పుణ్యక్షేత్రం అహోబిలంలో నరసింహా స్వామి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా విశేష పూజలు వైభవంగా నిర్వహించారు. బుధవారం దిగువ అహోబిలంలోని రంగ మంటపంలో సుదర్శన హోమం కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ మఠంప్రతినిధి సంపత్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. భక్తుల గోవిందా నామ స్మరణల నడుమ స్వామి మహా పూర్ణాహుతి జరిగింది. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందచేశారు. అలాగే చాతుర్మాస్య దీక్ష సందర్భంగా అహోబిలంలో బస చేసిన పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికులు తమ ఆరాధ్య దైవం మాలోల నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపారు. ఈ కార్యక్రమంలో రంగరాజులు,సేతురామన్ , భద్రయ్య, ఏ డి ఏ రవికాంత్ చౌదరి, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News