Sunday, October 6, 2024
HomeదైవంAhobilam: ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి స్వాతి జన్మదిన వేడుకలు

Ahobilam: ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి స్వాతి జన్మదిన వేడుకలు

అహోబిల మఠంలో స్వాతి నక్షత్ర వేడుకలు

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం దిగువ అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి వేడుకలు ఘనంగా జరిగాయి. దిగువాహోబిలంలోని ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తుల సమక్షంలో హోమం నిర్వహించారు. నరసింహ స్వామి గోవింద నామ స్మరణతో ఆ ప్రాంతమంతా మారుమొగింది. అనంతరం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి సతీమణి గంగుల ఇందిరా రెడ్డి స్వాతి వేడుకల్లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News