Amarnath Yatra: భక్తులు ఎంతో పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర నేటి నుంచి తిరిగి ప్రారంభమైంది. జమ్ములోని భగవతినగర్ బేస్ క్యాంప్ నుంచి తొలి విడత యాత్రను అధికారులు అధికారికంగా ప్రారంభించారు. ఈ విడతలో భాగంగా సుమారు 5 వేల మందికి పైగా భక్తులు బాల్తాల్ బేస్ క్యాంప్ వైపు పయనమయ్యారు. భద్రతా ఏర్పాట్ల నడుమ ఉత్సాహంగా సాగుతున్న ఈ యాత్రకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
అమర్నాథ్ యాత్ర విశేషాలు: జమ్ముకశ్మీర్లోని హిమాలయ ప్రాంతంలో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహ యాత్ర హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది. సముద్ర మట్టానికి సుమారు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు తరలివెళ్తారు. యాత్ర కోసం భక్తులు ప్రధానంగా రెండు మార్గాలను ఎంచుకుంటారు. అగస్త్య ముని మార్గంగా భావించే పహల్గామ్ రూట్ మరియు కొద్దిగా కష్టతరమైనా త్వరగా చేరుకునే బాల్తాల్ రూట్. ప్రతి ఏటా భక్తుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం, భద్రతా బలగాలు, స్థానిక యంత్రాంగం కలిసి భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తాయి. సాధారణంగా రాఖీ పౌర్ణమి వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. ప్రతికూల వాతావరణం, మంచు కరిగిపోవడం వంటి కారణాల వల్ల వాతావరణాన్ని బట్టి యాత్రను తాత్కాలికంగా నిలిపివేయడం, తిరిగి పునఃప్రారంభించడం చేస్తుంటారు.
Also Read-Ekadashi: నేడే తొలి ఏకాదశి.. యోగనిద్రలోకి శ్రీమహావిష్ణువు!

