Sunday, November 16, 2025
HomeదైవంAntarvedi: అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

Antarvedi: అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

పశ్చిమ గోదావరి జిల్లా అంతర్వేది(Antarvedi Lakshmi Narasimha Swamy Temple) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి సేవలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ: అంతర్వేది ఆలయ ప్రాంగణాన్ని భక్తులకు మరింత అనుకూలంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో పారిశుధ్యం, రోడ్లు, తాగునీరు, వసతి గృహాల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

స్వామివారి రథానికి సంబంధించి చేపట్టిన పనుల పురోగతిని కూడా మంత్రి సమీక్షించారు. ఆలయ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు సీసీ కెమెరాల ఏర్పాటును పర్యవేక్షించాలని, భక్తుల రద్దీ దృష్ట్యా అదనపు సిబ్బంది నియామకాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈవో, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad