Tuesday, September 17, 2024
HomeదైవంAyyappa:కేరళ అయ్యప్ప స్వామి ప్రసాదం తాత్కాలికంగా నిలిపివేత

Ayyappa:కేరళ అయ్యప్ప స్వామి ప్రసాదం తాత్కాలికంగా నిలిపివేత

కేరళ అయ్యప్ప స్వామి ప్రసాదం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అయ్యప్ప దేవాలయం ప్రకటించింది.
ట్రావెన్కోర్ దేవస్థానం ఆధ్వర్యంలో తయారవుతున్న అరవణం ప్రసాదంలో వాడుతున్న యాలకుల్లో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రసాదంలో వాడిన యాలకుల్లో 14 రకాల హానికారక అవశేషాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రసాదం నిలిపివేసిన దేవస్థానం.. ఇప్పటికే పంపిణీకి సిద్ధంగా ఉన్న ఆరు లక్షల డబ్బాలను ధ్వంసం చేయాలంటూ కోర్టు ఆదేశించింది.

- Advertisement -

రేపటి నుంచి యాలకులు లేని అరవనం ప్రసాదాన్ని పంపిణీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈకారణంగా రానున్న నాలుగైదు రోజుల్లో మకరజ్యోతి కి వచ్చే లక్షలాది మంది భక్తులకు ప్రసాదం కొరత ఏర్పడే అవకాశం ఉంది. దీంతో యుద్ధ ప్రాతిపదికన రేపటి నుంచి యాలకులు లేని ఆరవణం ప్రసాదాన్ని తయారుచేసి పంపిణీ చేసేందుకు ట్రావెల్ కోర్ దేవస్థానం సిద్ధమైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News