Friday, September 20, 2024
HomeదైవంYadadri: బాహుపేటలో అంగరంగ వైభవంగా దుర్గా విగ్రహ ప్రతిష్టాపన

Yadadri: బాహుపేటలో అంగరంగ వైభవంగా దుర్గా విగ్రహ ప్రతిష్టాపన

యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామంలో నూతనంగా పునర్నిమించిన దుర్గామాత ఆలయంలో దుర్గా అమ్మవారి విగ్రహం ప్రతిష్టాపన ఉత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన అనంతరం 42 అడుగుల నల్ల రాతి ధ్వజ స్తభ ధ్వజాహోహణం జరిగింది. బాహుపేట గ్రామస్తుల జేజేల మధ్య అత్యంత భక్తి శ్రద్దలతో ఆరు రోజుల పాటు యజ్ఞ హోమాలు పూర్తి అయ్యాయి. దీంతో అమ్మవారి దర్శనం పునఃప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర శ్రీశైలం, పెద్దిరెడ్డి కృష్ణా రెడ్డి, కోరటికంటి సిద్దయ్య, కుండే ఐలయ్య, గజం సంతోష్ దంపతుల తో పాటు భక్తులు, చుట్టుపక్కల గ్రామస్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News