Sunday, October 6, 2024
HomeదైవంBandiathmakuru: మహిషాసుర మర్దినిగా ఓంకారేశ్వరి

Bandiathmakuru: మహిషాసుర మర్దినిగా ఓంకారేశ్వరి

గ్రామోత్సవంలో అమ్మవారు

మండల పరిదిలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీ గంగా ఉమా సమేత ఓంకార సిద్దేశ్వర స్వామి దేవస్థానం ఓంకార క్షేత్రం శ్రీదేవి శరన్నవరాత్రులు 8 వరోజు అమ్మవారిని ఆలయ అర్చకులు చక్రపాణి, మృగపాణి శర్మలు శ్రీ మహిషాసుర మర్దినిగా అలంకరించి అమ్మవారికి పూజా కార్యక్రమంలో మహా గణాధిపతి పూజ, మహాలక్ష్మిపూజ, మహాకాళిపూజ, మహా సరస్వతి పూజ ఏకవార రుద్రాభిషేకం, కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని గ్రామోత్సవం నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైసిపి మండల కన్వీనర్ బారెడ్డి శ్రీనివాస్ రెడ్డి దంపతులు, దేవస్థానం చైర్మన్ విశ్వనాథ రెడ్డి దంపతులు, ధర్మకర్త మండలి సభ్యులు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి నాగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News