Saturday, October 5, 2024
HomeదైవంBethamcharla: మద్దిలేటి స్వామికి కేజి వెండి అందజేసిన భక్తుడు

Bethamcharla: మద్దిలేటి స్వామికి కేజి వెండి అందజేసిన భక్తుడు

స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు

బేతంచెర్ల మండలం ఆర్ ఎస్ రంగాపురం గ్రామ పరిధిలో వెలసిఉన్న శ్రీ మద్దిలేటీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొనుటకు శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరులివచ్చారు. భక్తులు వారి వారి మొక్కులు స్వామి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి వివిధ పూజల ద్వారా 8 లక్షల 90 వేల 681 రూపాయలు ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి డి. పాండురంగారెడ్డి, ఆలయపాలక మండలి చైర్మన్ బి. సీతారామచంద్రుడులు తెలియజేశారు.

- Advertisement -

ఇందులో అవుకు పట్టణంనకు చెందిన జి తిరుపతయ్య కుమారుడు జి. రామకృష్ణుడు 1 లక్ష రూపాయలు,హైదరాబాద్ కు చెందిన మద్దిలేటి ( అసిస్టెంట్ సెక్రెటరి ) 1 కేజి వెండి హారతులను, నంద్యాల పట్టణానికి చెందిన ఎం / ఎస్. శ్రీధర్ ట్రేడర్స్ అగర్ బత్తి వారు భక్తల తాగు నీటి సౌఖర్యం కొరకు మంచి నీటి ట్యాంక్ ను స్వామి వారికి సమర్పించుకున్నారని డి. పాండురంగారెడ్డి, చైర్మన్ బి సీతారామచంద్రుడులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News