Sunday, September 22, 2024
HomeదైవంBethamcharla: మద్దిలేటి స్వామి ఆదాయం 52 లక్షలు

Bethamcharla: మద్దిలేటి స్వామి ఆదాయం 52 లక్షలు

బేతంచెర్ల మండలం ఆర్ ఎస్ రంగాపురం గ్రామపరిధిలో వెలసిన శ్రీలక్ష్మీఘనమద్దిలేటీ స్వామి, అమ్మవార్లకు భక్తులు సమర్పించిన కానుకల హుండీ లెక్కింపు పూర్తయింది. ఆలయ కార్యనిర్వాహణాధికారి పాండురంగారెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సీతారామచంద్రుడు, ధర్మకర్తలు టి. లక్ష్మీనాయుడు, ఎమ్ సుశీల, ఎమ్ లక్ష్మీదేవి, జి వెంగళరెడ్డి, ఎ. ప్రవీణ్ తనిఖీ అధికారి కె. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం సిబ్బంది పాల్గొనగా హండి లెక్కింపు కార్యక్రమం సాగిం. శ్రీ స్వామి వారి హుండీ లెక్కింపు ద్వారా మాత్రమే 64 రోజులకు 51లక్షల 58వేల 105రూపాయలు నగదు, 28గ్రాముల బంగారు, 5 కేజీల 50 గ్రాములు వెండి సమాకురిందని ఆలయ కార్యనిర్వాహణాధికారి పాండురంగా రెడ్డి, చైర్మన్ సీతారామచంద్రుడు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News