Thursday, April 10, 2025
HomeదైవంBhajana competitions: జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ భజన మండలి పోటీలు

Bhajana competitions: జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ భజన మండలి పోటీలు

భజన మండలి పోటీలను నిర్వహించిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

శంకర్ పల్లి పట్టణ కేంద్రంలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో జస్టిస్ కొండా మాధవ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేవెళ్ల నియోజకవర్గ స్తాయి భజన మండలి పోటీల్లో భాగంగా శంకర్ పల్లి మండల స్థాయి ఫైనల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో దోబీ పెట్, ఎల్వర్తి, టంగాటూర్, మహాలింగపురం గ్రామాల నుండి భజన మండలి బృందాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

భజన కార్యక్రమాలు శారీరక, మానసిక ఒత్తిడిని జయించే శక్తిని ఇస్తాయి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొండా లక్ష్మీ కాంత్ రెడ్డి , కొండా వీరా రెడ్డి ,ప్రభాకర్ రెడ్డి , దండు మోహన్, నాగ భూషణం, గొల్లపల్లి అంజి రెడ్డి , శీలం కోటి విశ్వేశ్వర్, గుండా శేఖర్, శంకర్ పల్లి బిజెపి మండల అధ్యక్షులు బసగళ్ల రాములు గౌడ్ ,రాజా చంద్ర,లోకేష్, విష్ణు వర్ధన్ రెడ్డి మరియు అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News