Hindu Beliefs in Telugu: మన దేశంలో మూఢనమ్మకాలు చాలా ఎక్కువ. దేవుళ్లను నమ్మేవారు అధిక సంఖ్యలో ఉంటే, సైన్స్ ను సమర్థించేవారు కొంత మందే ఉన్నారు. దేవుడికి పూజలు చేయడం హిందూ సంప్రదాయంలో భాగం. ఎక్కడ లేనటువంటి దేవాలయాలు, ఆచారాలు ఇక్కడ ఉన్నాయి. పూజలు, యజ్ఞాలు, కర్మకాండలు, వర్ణాశ్రమ ధర్మాలు అనేక విధాలైన విషయాలు గురించి మన వేదాల్లో చెప్పారు.
సాధారణంగా ఆలయాల్లో ఎక్కువగా పురుషాధిక్యత కనిపిస్తూ ఉంటుంది. ఇందుకు కేరళ శబరిమల ఘటనే ఉదాహరణ. ఇక్కడి ఆలయంలో మహిళల ప్రవేశం నిషేధించడంతో సుప్రీంకోర్టు కలుగజేసుకుని స్త్రీలకు అనుగుణంగా తీర్పు ఇవ్వడం మనం చూశాం. అయితే కొన్ని ఆలయాల్లో మహిళల ప్రవేశమే నిషేధించినప్పుడు బహిష్ట సమయంలో అసలు అనుమతిస్తారా? ఒక వేళ వేళ్తే ఏమవుతుంది? నెలసరి తర్వాత ఎన్ని రోజులకు వెళ్లాలి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన మదిలో తరచూ మెదులుతూ ఉంటాయి. దీనికి సమాధానం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మహిళలకు పీరియడ్స్ కామన్. ఈ సమయంలో బ్లడ్ లాస్ అవ్వడం వల్ల వారు కాస్త బలహీన పడటంతోపాటు కాస్త అపరిశుభ్రంగా ఉంటారని నమ్ముతారు. అయితే పూర్వకాలంలో స్త్రీలకు రుతుక్రమం వచ్చినప్పుడు నది నీరు ఎక్కడ కలుషితమవుతుందనే భయంతో ఇంట్లోనే ఉండాలనే నిబంధన పెట్టారు. అంతేకాకుండా బహిష్టు సమయంలో నారీమణులు అపరిశ్రుభంగా ఉంటారనే మరో నమ్మకం కూడా వారికి ఉండేది. ఇలాంటి సమయంలో వారు ఆలయ ప్రవేశం చేస్తే అపవిత్రం అవుతుందని అనాటి పెద్దలు, పండితులు గుడ్డిగా నమ్మేవారు. మహిళలు బయటకు వెళ్తే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని మరికొందరి వాదన.
మహిళలకు రుతుస్రావం ఏడు రోజులు ఉంటుంది. అంటే హిందూమత గ్రంథాల ప్రకారం, పీరియడ్స్ ముగిసిన తర్వాత రోజు ఆలయంలోకి ప్రవేశంచవచ్చు. బహిస్టు సమయంలో ఆలయాన్ని సందర్శించడమనేది వారి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని సైన్స్ చెబుతోంది.