Saturday, November 15, 2025
HomeదైవంVinayaka Chavithi:బుధవారం నాడు వినాయకుడికి ఈ వస్తువులు సమర్పిస్తే..అంతా శుభమే!

Vinayaka Chavithi:బుధవారం నాడు వినాయకుడికి ఈ వస్తువులు సమర్పిస్తే..అంతా శుభమే!

Vinayaka Puja: దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది గణేష్ ఉత్సవాలు ఆగస్టు 27న ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ప్రతి రోజు గణేశుడిని భక్తులు తమ ఇళ్లలో, పండుగ మండపాల్లో పూజలతో సత్కరిస్తారు. ఆ దశలో బుధవారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది.

- Advertisement -

జ్ఞానం, శ్రేయస్సు..

ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాల్లో మొదటి బుధవారం సెప్టెంబర్ 3న వచ్చింది. శాస్త్రపరంగా చూస్తే బుధవారం జ్ఞానం, శ్రేయస్సు, విజయానికి సంకేతంగా పరిగణిస్తారు. అందువల్ల గణపతి పూలజను ఈ రోజున మరింత ఘనంగా చేయడం శుభప్రదమని నమ్మకం ఉంది. భక్తులు ఈ రోజున గణేశుడికి అతనికి ఇష్టమైన సమర్పణలు చేస్తే కష్టాలు తొలగిపోతాయని, శుభఫలితాలు కలుగుతాయని విశ్వాసం.

మోదకాలను..

బుధవారం గణేశుడిని సంతోషపరచేందుకు మోదకాలను సమర్పించడం ఎంతో శ్రేయస్సును ఇస్తుందని చెబుతారు. గణేశుడి ఇష్టమైన మిఠాయిల్లో మోదకాలు అగ్రస్థానంలో ఉంటాయి. సాధారణంగా బెల్లం, కొబ్బరితో తయారు చేసిన మోదకాలను నైవేద్యంగా అందిస్తారు. భక్తులు సంఖ్యకు ప్రాముఖ్యత ఇస్తూ 5, 11 లేదా 21 మోదకాలను సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. మోదకాలు జ్ఞానం, సంతోషం, శాంతిని ప్రసాదిస్తాయని విశ్వాసం ఉంది.

దర్భలు..

దర్భలను సమర్పించడం కూడా ప్రత్యేక ఆచారం. గణేశుడికి దర్భలు పవిత్రమైనవి. గణేశుడి పూజలో 21 దర్భలు లేదా దర్భల కట్టను సమర్పించడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇవి ఆయురారోగ్యానికి సూచికగా నిలుస్తాయి. పూజకు ముందు దర్భలను గంగాజలంతో శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, అక్షతలతో కలిపి వినాయకుడి ముందుంచుతారు.

లడ్డులు కూడా…

లడ్డులు కూడా గణేశుడి ఇష్టమైన నైవేద్యాల్లో ఒకటి. శనగపిండి, రవ్వ, పెసలతో చేసిన లడ్డులు వినాయకుడిని ఆనందింపజేస్తాయని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా పసుపు రంగు శనగపిండి లడ్డులు బుధవారం సమర్పించడం పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నైవేద్యాన్ని 5 లేదా 11 సంఖ్యలో సమర్పించడం మంగళకరంగా పరిగణిస్తారు.

పండ్లను సమర్పించడం కూడా బుధవారం గణేశ పూజలో ఒక ప్రధాన భాగం. అరటిపండు, కొబ్బరి, దానిమ్మ, జామ వంటి పండ్లను నైవేద్యంగా ఉంచుతారు. ప్రత్యేకంగా ఒక జత అరటిపండ్లు సమర్పించడం అదృష్టాన్ని తెస్తుందని విశ్వాసం ఉంది. పండ్లను పూజకు ముందుగా గంగాజలంతో శుద్ధి చేసి సమర్పించడం ఆచారం.

Also Read: https://teluguprabha.net/devotional-news/is-rain-on-wedding-day-good-or-bad-according-to-vastu/

సింధూరం వినాయకుడికి ఎంతో ప్రీతికరం. గణేశుడి నుదిటిపై ఎరుపు లేదా నారింజ రంగు సింధూరం అద్దడం శుభకరమని భావిస్తారు. ఇది భక్తుల జీవితాల్లో అదృష్టం, రక్షణకు ప్రతీకగా నిలుస్తుంది. వినాయకుడికి సింధూరాన్ని సమర్పించడం ఆయన ఆశీస్సులు పొందేందుకు సహాయపడుతుందని నమ్మకం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad