మహానంది క్షేత్రంలో 55 గదుల నంది సదనం వసతి సముదాయంకు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చేతుల మీదుగా భూమి పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. బుధువారం ఈ కార్యక్రమం జరుగనుందని ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవస్థానం నిధులతో భక్తుల సౌకర్యార్థం 10.50 కోట్ల రూపాయలతో అన్ని రకాల వసతి సౌకర్యాలతో కూడిన నంది సదనం భవన నిర్మాణంకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/7c757a5b-c884-4e18-8827-a3d63334ddb4-1024x689.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/711942e9-3b3c-4081-be19-f5d995d7be1e-1024x689.jpg)