Sunday, October 6, 2024
HomeదైవంMantralayam: వైభవంగా సుజేంద్రతీర్థుల ఆరాధన

Mantralayam: వైభవంగా సుజేంద్రతీర్థుల ఆరాధన

బృందావనానికి విశేష పూజలు, అలంకరణ

పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో పూర్వ పీఠాధిపతి సుజేంద్రతీర్థుల ఆరాధన ఉత్సవాలు ప్రస్తుత పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు అధ్వర్యంలో వైభంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామి చిత్రపటాన్ని బంగారు రథంపై ఉంచి, భక్తులతో ప్రాకారంలో ఘనంగా ఊరేగించారు.

- Advertisement -

మూల బృందావనానికి అప్రమేయ, పండితుల అధ్వర్యంలో విశేష ఫలం, పంచామృతాభిషేకం నిర్వహించారు. ఊరేగింపులో భక్తులు భజనలు, కీర్తనలు పాడారు. మంత్రాలయం, మఠం అభివృద్ధిలో చేసిన కృషిని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మఠం మేనేజర్లు ఎస్ కే శ్రీనివాసు రావు, వెంకటేష్ జోషి, ఏ ఏ ఓ మాధవసెట్టి, పీ అర్ ఓ నరసింహమూర్తి, వ్యాసరాజ చార్, జయతీర్థ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News