మండల పరిధిలోని హరినగరం గ్రామ సమీపంలో గల ఇస్కాన్ అహోబిలం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి పారవేట ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ అహోబిలం ప్రాజెక్ట్ ఇంచార్జ్ చంద్ర కేశవ దాస్ తెలిపారు.
- Advertisement -
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/3bbf7250-e7fd-4572-b3cb-f0217ae8edf8-1024x768.jpg)
అహోబిల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పారవేట ఉత్సవాల చివరి మజిలీలో భాగంగా ఇస్కాన్ అహోబిలం హరినగరం దగ్గర ఇస్కాన్ భక్త బృందంచే కీర్తనలు, తులసి హారతి, గౌర హారతి, నరసింహ కీర్తన, ప్రవచనాలు, సంస్కృతిక కార్యక్రమాలు, లక్ష్మీ నరసింహ స్వామికి స్వాగతం, ఉత్సవ పల్లకి ప్రయాణం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/99bf0b59-b6ee-4d6f-9676-a6f837fbac7c-1024x768.jpg)