Thursday, October 3, 2024
HomeదైవంJadcharla: బాలాత్రిపుర సుందరి దేవిగా బంగారు మైసమ్మ

Jadcharla: బాలాత్రిపుర సుందరి దేవిగా బంగారు మైసమ్మ

అమ్మవారి ఆలయాల్లో ఆధ్యాత్మిక సందడి

జడ్చర్ల పట్టణంలో దసరా శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయాల్లో, మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట 44వ జాతీయ రహదారి పక్కన, ఐబి బంగ్లా సమీపంలో ఉన్న శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవత మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

- Advertisement -

శ్రీ బంగారు మైసమ్మకు తల్లి దేవతకు అభిషేకం అనంతరం నవరాత్రోత్సవ పూజలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. భక్తులు అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గోనెల నరేందర్, ఘనాతే విజయ్ కుమార్, భక్తులు మహేశ్వరి, సీత, శ్రీనివాసులు, జయ శ్రీవాత్సవ్, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News