Thursday, April 10, 2025
HomeదైవంJadcharla: శ్రీ దుర్గా దేవిగా బంగారు మైసమ్మ దేవత

Jadcharla: శ్రీ దుర్గా దేవిగా బంగారు మైసమ్మ దేవత

దసరా శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట 44వ జాతీయ రహదారి పక్కన, ఐబి (డాగ్) బంగ్లా సమీపంలో ఉన్న శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవత 8వ రోజు గురువారం శ్రీ దుర్గా దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

- Advertisement -

దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి భక్తులు నాగరాజు హరిప్రియ దంపతులు, రంజిత్ అనిషా దంపతులు హాజరై ముందుగా గణపతి, గౌరీ పూజ నిర్వహించి, శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవతకు అభిషేకం, కుంకుమార్చన, దేవి నవ రాత్రోత్సవ ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించి మినుప గారెలు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

పూజా కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ గోనెల నరేందర్ మహేశ్వరి దంపతులు, ప్రధాన కార్యదర్శి ఘనాతే విజయ్ కుమార్ గౌతమి ప్రియాంక, వైస్ చైర్మన్ గుండు చంద్ర శేఖర్, భక్తులు సీత, శ్రీనివాసులు, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News