Tuesday, September 17, 2024
HomeదైవంSrisailam: శ్రీశైలంలో జ్వాలాతోరణం

Srisailam: శ్రీశైలంలో జ్వాలాతోరణం

ఘనంగా జ్వాలాతోరణం

శ్రీశైలంలో ఘనంగా కార్తీక పౌర్ణమి జరిపారు. ప్రధాన ఆలయం ముందున్న గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణోత్సవానికి పెద్దఎత్తున భక్తులు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ ఉత్సవానికిగాను గంగాధరమండపం వద్ద తాత్కాలికంగా స్తంభాలను ఏర్పాటు చేసి, ఆ స్తంభాలను కలుపుతూ అడ్డంగా మరో స్తంభం ఏర్పాటు చేశారు. ఈ స్తంభంపై వేలాడే విధంగా నేతితో తడిపిన నూలు వత్తులను ఏర్పాటు చేశారు. ఈ వత్తులపై తిరిగి నెయ్యిని పోసి జ్వాలా తోరణాన్ని వెలిగించారు.

- Advertisement -

పురాణపరంగా త్రిపురాసురులను సంహరించిన తరువాత పరమేశుని దృష్టిదోషపరిహారం కోసం, ఇంకా విజయుడైన అతని గౌరవార్థం పార్వతీదేవి మొదటగా ఈ జ్వాలాతోరణోత్సవాన్ని జరిపించిందనీ, అప్పటి నుండి ఇది ఆచారమైందని చెప్పబడుతోంది. అందుకే ఆలయంలో ఈ జ్వాలాతోరణోత్సవాన్ని జరపడం సంప్రదాయమైంది. కాగా తోరణంలో కాలిన నూలువత్తుల నుండి వచ్చిన భస్మాన్ని భక్తులు నుదుట ధరించడం ఎంతో విశేషంగా భావిస్తారు. ఈ విధంగా ధరించడం వలన ఆరోగ్యం, ఆయుష్షు, ఐశ్వర్యం లభిస్తుందని విశ్వసిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News