Sunday, November 16, 2025
HomeదైవంKarthikamasam: కార్తీక మాసంలో నిత్య దీపారాధన ఎలా చేయాలి..ఎన్ని వత్తులు వేయాలంటే!

Karthikamasam: కార్తీక మాసంలో నిత్య దీపారాధన ఎలా చేయాలి..ఎన్ని వత్తులు వేయాలంటే!

Karthika Masam Lamp Lighting Rules: కార్తీక మాసంలో ప్రతి ఇంట్లో కూడా ఓ భక్తి వాతావరణం ఏర్పడుతుంది. ఈ నెలలో ప్రతిరోజూ పూజలు, దీపారాధన చేసే ఆచారం చాలా మంది ఇళ్లలో కనపడుతుంటుంది. భగవంతునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో ప్రత్యేకంగా దీపాన్ని వెలిగించడం శుభసూచకంగా పండితులు చెబుతుంటారు. అయితే దీపాన్ని ఎలా వెలిగించాలి, ఎన్ని వత్తులు వేయాలి, దీపం ఏ దిశలో ఉంచాలి అనే విషయాల్లో చాలామందికి అనేక సందేహాలు ఉంటాయి. ఈ అంశంపై ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు దీని గురించి స్పష్టంగా వివరించారు.

- Advertisement -

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను…

ఆయన చెప్పిన దాని ప్రకారం, దీపారాధనలో ముఖ్యమైనది భక్తి,, శ్రద్ధ. కానీ దీపం ఉంచే విధానం కూడా సమానంగా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. దీపాన్ని వెలిగించే సమయంలో మూడు వత్తులు వేయడం అత్యంత శ్రేయస్కరంగా చెబుతారు. ఈ మూడు వత్తులు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తాయి. అంటే మనం వెలిగించే దీపం కేవలం ఒక కాంతి మాత్రమే కాకుండా దైవ తత్వాన్ని ప్రతిబింబించే పవిత్ర జ్యోతి.

Also Read:https://teluguprabha.net/devotional-news/nagula-chavithi-2025-karthika-masam-puja-timings-and-significance/

ఒకటి తూర్పు దిశలో…

చాగంటి గారి మాటల్లో, దీపం వెలిగించే సమయంలో ఆ జ్యోతులలో ఒకటి తూర్పు దిశలో ఉండేలా చూడాలి. తూర్పు దిశ సూర్యోదయ దిశ. ఇది శుభదిశగా పరిగణించబడుతుంది. ఈ విధంగా దీపం పెట్టడం వల్ల ఆధ్యాత్మిక శక్తులు పెరుగుతాయని, మనసుకు ప్రశాంతత కలుగుతుందని ఆయన వివరించారు.

పసుపు, కుంకుమను..

దీపాన్ని వెలిగించిన వెంటనే పూలు లేదా పసుపు, కుంకుమను సమర్పించడం ఒక మంచి ఆచారంగా సూచించారు. దీపారాధనను ‘మంగళదీపం’ అని పిలుస్తారు కాబట్టి, దీపం వెలిగించగానే దానిపై పూలు ఉంచడం, భగవంతునికి నమస్కరించడం అత్యంత శ్రేయస్కరమని ఆయన చెప్పారు. ఈ ఆచారం శుభఫలితాలను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.

చాగంటి గారి వివరణ ప్రకారం, దీపం ఎప్పుడూ పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. పూజా మందిరం లేదా గృహ దేవతా స్థలం సరిగ్గా శుభ్రంగా ఉండాలి. దీపం ఉంచే స్థలం చుట్టూ చెత్త లేకుండా, శాంతియుత వాతావరణంలో దీపాన్ని వెలిగించడం వల్ల ఆ స్థలం ఆధ్యాత్మికంగా ప్రకాశిస్తుంది.

జ్ఞానం, ధర్మం, శాంతి…

దీపారాధన సమయంలో మనసు కేంద్రీకరించుకోవడం కూడా అత్యంత ముఖ్యం. దీపాన్ని వెలిగించేటప్పుడు మనసులో “లోకానికి వెలుగు, మనసుకు శాంతి” అనే భావన కలిగి ఉండాలి. ఈ జ్యోతి మన జీవితంలో జ్ఞానం, ధర్మం, శాంతి వెలుగులు నింపాలని మనసులో కోరుకోవడం మంచిదని ఆయన చెప్పారు.

చాగంటి కోటేశ్వరరావు గారు ఈ పద్ధతిని పాటించడం వల్ల ఆధ్యాత్మికంగా శుభఫలితాలు మాత్రమే కాకుండా ఇంట్లో సానుకూల శక్తులు పెరుగుతాయని తెలిపారు. దీపం వెలిగించడం అంటే అంధకారాన్ని తొలగించడం. అదే విధంగా మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వెలిగించడమే దీపారాధన అసలు ఉద్దేశమని ఆయన వివరించారు.

సూర్యోదయం ముందు…

దీపం వెలిగించే సమయానికి సంబంధించి కూడా ఆయన కొన్ని సూచనలు చేశారు. ఉదయం సూర్యోదయం ముందు లేదా సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో దీపం వెలిగించడం అత్యంత శ్రేయస్కరం. ఆ సమయాల్లో దేవతా తత్వం సులభంగా మనసుకు చేరుతుందని పూర్వోక్తులు చెబుతున్నాయని ఆయన గుర్తు చేశారు.

దీపం ఏ నూనెతో వెలిగించాలి అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, నువ్వుల నూనె, నెయ్యి లేదా కొబ్బరినూనెతో దీపం వెలిగించడం ఉత్తమమని చెప్పారు. నెయ్యితో దీపం వెలిగిస్తే సుఖశాంతులు, నువ్వుల నూనెతో వెలిగిస్తే పాపనివారణ, కొబ్బరినూనెతో వెలిగిస్తే శుద్ధి కలుగుతుందని ఆయన వివరించారు.

Also Read:https://teluguprabha.net/devotional-news/why-devotees-remove-footwear-before-entering-temple/

ఇలా ప్రతి అంశంలో దీపం ఒక దైవప్రతీకంగా నిలుస్తుందని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. దీపాన్ని వెలిగించడం కేవలం ఆచారం కాదు, అది మన మనసును పరిశుభ్రం చేసే సాధన అని ఆయన ఉద్ఘాటించారు. దీపారాధనలో ఆధ్యాత్మికతతో పాటు మనసులోని చీకటిని తొలగించే సంకల్పం ఉండాలని ఆయన సూచించారు.

కార్తీక మాసం మొత్తం దీపారాధన చేయడం వల్ల భక్తికి కొత్త ఉత్సాహం వస్తుంది. ప్రతి రోజు దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో ఆధ్యాత్మిక శక్తులు పెరుగుతాయని, పాపాల నివారణతో పాటు శుభఫలితాలు కలుగుతాయని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad